నంద్యాల ఉప ఎన్నికలతోనే ఒకపక్క టెన్షన్ పడుతున్న టీడీపీకి.. మరో పక్క కాకినాడ కార్పొరేషన్ టెన్షన్ పట్టుకుంది. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఓట్లు కీలకం. ముఖ్యంగా కాకినాడలో మరింత అధికం! కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆవర్గపు ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే సమయంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో.. టీడీపీ […]
Tag: mudragada
చంద్రబాబుది రావణాసురుడి అన్నయ్య పాలనా?!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఏపీ సీఎం చంద్రబాబుపై వెరైటీగా విరుచుకుపడ్డారు. ఏపీలో భయపడుతూ బతకాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన రావులపాలెం – అంతర్వేది ముద్రగడ కాపు సత్యాగ్రహ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంది. ముద్రగడపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయని పోలీసులు ఆయన పాదయాత్రలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంటూ ముద్రగడను మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్దే నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులకు, ముద్రగడకు […]
కాపు ఉద్యమంలో లుకలుకలు!
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశలు తీరతాయా? అసలు కాపు వర్గానికి చెందిన నేతలందరూ ఒక్క దారిలోకి వచ్చి ముద్రగడ కోరుతున్నట్టు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యమానికి మద్దతు పలుకుతారా? అంటే ఇప్పుడు ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే.. కాపు ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్న వేడి ఇప్పుడు కనిపించడం లేదు. అంతేకాదు, కాపు నేతల మధ్యే పెద్ద ఎత్తున లుకలుకలున్నట్టుగా […]
ముద్రగడ మౌనం అందుకేనా?
ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]
ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]
ముద్రగడ ఏం సాధించారు?
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి […]
ముద్రగడకి మళ్ళీ నిరాశే
తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి […]
కాపు నేతల్లో కుమ్ములాటలు!!
ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి. రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన […]
కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…
కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే […]