ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. […]