ఇంతలోనే ఎంత వ్యత్యాసం! ఢిల్లీ రాజకీయాలను `చీపురు`తో తుడిచేయాలని ఉన్నత ఉద్యోగాన్ని వదిలి వచ్చిన `సామాన్యుడి`ని ప్రజలు అందలమెక్కించారు. రాజకీయాల్లో మార్పు తథ్యమని భావించి అనూహ్య విజయాన్ని అందించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. ఆ సామాన్యుడిపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లంచం తీసుకున్నాడంటూ.. ఏకంగా ఏసీబీకి కూడా ఫిర్యాదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా సామాన్యుడి సైన్యంలోని కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఆ సామాన్యుడు, ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా సతమతమవుతున్నారు. ఆమ్ ఆద్మీలో […]