2019లో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్కు మరికొద్ది రోజుల్లోనే భారీ షాక్ తగలనుందని సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్బై చెప్పి బాబు పంచన చేరిపోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఇదే నిజమైతే.. వైసీపీకి రాజధాని ప్రాంతంలో తీవ్రమైన షాక్ తప్పదని అంటున్నారు. వియంలో కివెళ్తే..
కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్దరూ సైకిలెక్కేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారట. అయితే, దీనికన్నా ముందు.. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని డిసైడ్ అయిన చంద్రబాబు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కి తెరదీశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సెకిలెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఏడాది కిందట జరిగిన ఆపరేషన్ ఆకర్ష్తో హేమా హేమీల్లాంటి నేతలు వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీ గూటికి చేరిపోయారు.
ఇక, ఇప్పుడు కూడా బాబు మరో సారి ఆపరేషన్ ఆకర్ష్కి తెరదీస్తే.. వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక, రక్షణ నిధి, ముస్తాఫాల విషయానికి వస్తే.. గత ఆపరషన్ సమయంలోనే ఈ ఇద్దరికీ మంచి ఆఫర్లు వచ్చాయని సమాచారం అయినప్పటికీ.. వీరు జగన్పై అభిమానంతో ఉండిపోయారిని అంటున్నారు. ఇక, ఇప్పుడు మాత్రం టీడీపీ నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నాయని, దీంతోనే అతిత్వరలో ఈ ఇద్దరూ జండా మార్చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.