ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేసిన రకుల్ ప్రీత్… క్లీన్ బౌల్డ్ అయిపోయిన నెటిజన్లు!

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ పంజాబీ కుటుంబంలో 1990వ సంవత్సరంలో అక్టోబర్ 10న రకుల్ జన్మించింది. మొదట తెలుగు చలన చిత్ర సీమలో ఓ వెలుగొందిన తరువాత హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా ఆమె నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం వున్న రకుల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. తెలుగులో ఆమె తొలి ఎవ్వరికీ తెలిసుండదు. అవును, ఆమె మొదటి చిత్రం కెరటం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగులో ఆమెకి హిట్ పడింది.

ఇక అక్కడి నుండి ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. రకుల్‌ ప్రీత్‌సింగ్ ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో జెండా పాతేందుకు తెగ ట్రై చేస్తోంది. రీసెంట్‌గా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసిన సంగతి విదితమే. ఈ సినిమా అక్కడ రీసెంట్‌గా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అంటున్నాయి సినిమా వర్గాలు.

ప్రస్తుతం అవకాశాల్లేక ఆమె ఇబ్బందులు పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందువల్లనే రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్తా సడలింపు ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలకు విశేష స్పందన వస్తోంది. రెడ్ కలర్ శారీలో రకుల్ అప్సరసలా మెరిసిపోతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్ లేటెస్ట్‌ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 32 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా 25లోనే ఉన్నట్టు కనిపిస్తోందని మన కుర్రాళ్ళు అల్లాడిపోతున్నారు.