కాపు ఉద్య‌మంలో లుక‌లుక‌లు!

కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. ఉద్య‌మిస్తున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆశ‌లు తీర‌తాయా? అస‌లు కాపు వ‌ర్గానికి చెందిన నేత‌లంద‌రూ ఒక్క దారిలోకి వ‌చ్చి ముద్ర‌గ‌డ కోరుతున్న‌ట్టు ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టిస్తారా? ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతారా? అంటే ఇప్పుడు ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతున్నాయి. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాపు ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్పుడు ఉన్న వేడి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, కాపు నేత‌ల మ‌ధ్యే పెద్ద ఎత్తున లుక‌లుక‌లున్న‌ట్టుగా […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]

ముద్రగడ ఏం సాధించారు?

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్‌ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్‌ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి […]

ముద్రగడకి మళ్ళీ నిరాశే

తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్‌ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్‌ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్‌ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి […]

దాసరి కొత్త పార్టీ పెడతారా?

మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారట. కాపు ఉద్యమం నేపథ్యంలో దాసరి నారాయణరావు ఒక్కసారిగా ‘పెద్ద నాయకుడు’ అయిపోయారు. ఈయన చుట్టూనే చిరంజీవి కూడా కనిపిస్తుండడంతో కాపు సామాజిక వర్గం, కొత్త పార్టీ గురించి దాసరి నారాయణరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారమ్‌. ఇదివరకు చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంది కాపు సామాజిక వర్గం. అది వమ్మయ్యింది. పవన్‌కళ్యాణ్‌ కూడా జనసేనతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రేపారు. ఆయనా వారి అంచనాల్ని అందుకోలేకపోయారు. […]

కాపు నేతల్లో కుమ్ములాటలు!!

ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి. రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన […]

కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…

కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే […]

రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]

కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]