కాంగ్రెస్ సీనియర్ నేతలుగా రాజకీయాల్లో చక్రం తిప్పి తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలు మారిన సీనియర్ నేతలు, అనంతకు చెందిన రాజకీయ నాయకులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు గతంలో నాటు సారా అమ్మారట! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. నమ్మలేకుండా ఉన్న ఇవన్నీ నిజాలని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో […]
Month: February 2017
పురందేశ్వరి జగన్ పంచన చేరి జై కొట్టడం ఖాయం
దివంగత ఎన్టీఆర్ ముద్దుల కుమార్తె నందమూరి ఇంటి చిన్నమ్మ.. పురందేశ్వరి త్వరలోనే జగన్ పంచకు చేరిపోతున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చిన్నమ్మ కేంద్రంలో మంత్రిగా చక్రం బాగానే తిప్పారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్కు రాం రాం చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. అయితే, అనుకున్నంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. పైగా కమల నాథుల నుంచి నోరు జాగ్రత్త.. చంద్రబాబును ఏమీ అనొద్దు వంటి ఆదేశాలతో ఆమె తనలో తానే […]
వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ నేతృత్వలోని వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా జగన్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పురందేశ్వరి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత, సీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా జగన్ పంచకే చేరుతున్నట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాటని స్వయంగా డీఎల్ వెల్లడించడం సంచలనం సృష్టించింది. తాను త్వరలోనే జగన్ పార్టీలోకి చేరుతున్నానని, జగన్ బాటలో నడుస్తానని […]
కాంట్రవర్సీ కింగ్ కు బాబు ఎమ్మెల్సీ టికెట్
నేను పారదర్శకంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన చేతల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించలేకపోతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్ల పంపకం జరుగుతోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి బాగా ఉపయోగపడతారని భావిస్తున్న వారికి బాబు వరుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాకాటి నారాయణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి, […]
కేఏ పాల్.. లోకేష్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా?
కేఏ పాల్.. దాదాపుగా ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేని పేరు! ప్రపంచం మొత్తం తిరిగానని, జార్జ్ బుష్ నుంచి ఒబామా వరకు అందరినీ తానే గెలిపించానని, తన సలహా తీసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారని ఇలా.. గొప్పలు చెప్పుకున్న పాల్.. తర్వాత కాలంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో రాజకీయాల్లో కూడా వేలు పెట్టి కాలు మొత్తం కాల్చుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ హత్యా కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? అయితే, దాదాపు నాలుగు […]
ఆడదానికి ఆడదే శత్రువు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది!
సాధారణంగా మనం అప్పుడప్పుడు వినేమాట.. ఆడదానికి ఆడదే శత్రువు అని! దీనిలో నిజం ఎంతో మనకు అంతగా తెలీదు. కానీ, ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటన నిజంగా ఈ మాట నూటికి నూటయాభై పాళ్లు నిజమని నిరూపిస్తోంది. తనతో సహజీవనం చేసిన ఓ మహిళను మరో మహిళ డీప్గా వాడేసుకోవడంతోపాటు సోషల్ మీడియా ఆధారంగా ఆడేసుకుంది కూడా!! నిజంగా ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని అనిపించేంతగా జరిగిన ఆ ఘటన ఎంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. […]
పాలిటిక్స్ లోకి స్పోర్ట్స్ ఫైర్ బ్రాండ్…’రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా.
బ్యాడ్మింటన్ లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన హైదరాబాదీ గుత్తాజ్వాల ఇక.. పాలిటిక్స్ని ఓ రేంజ్లో ఆడేసుకుంటుందట! మొన్నామధ్య పద్మ పురస్కారాల సందర్భంగా కేంద్రంపై ఓ రేంజ్లో విరుచుకుపడిన హాట్ బ్యూటీ.. తనకు పద్మ ఇవ్వకపోవడంపై హాట్ హాట్ వ్యాఖ్యలే చేసేసింది. ఎవరో వచ్చి చెబితేనేగానీ పద్మ పురస్కారాలు ఇవ్వరా అంటూ నిలదీసింది. అయితే, ఈ బ్యూటీ సాధించిన పతకాల కన్నా.. చేసిన కాంట్రవర్సీలే ఎక్కువని క్రీడా ఫీల్డ్లో పెద్ద టాక్. కొన్నాళ్లు క్రీడల్లో ఉన్నాక తన కన్నా […]
తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం
తమిళనాడులో అమ్మ జయలలిత మరణం తర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్నమ్మ.. అటు అమ్మ ఆత్మబంధువు పన్నీర్ సెల్వంల మధ్య జరిగిన చేపల మార్కెట్ రగడ దేశం మొత్తాన్ని ఉత్కంఠకు గురి చేసింది. ఆ తర్వాత చిన్నమ్మ జైలుకెళ్లడం.. పళని స్వామి సీఎం కావడం పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంతటితో పాలిటిక్స్ చల్లారలేదు. తనకు మద్దతిచ్చే వారిలో మరోపక్క పన్నీర్ రగడ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది […]
తమిళనాట రాష్ట్రపతి పాలనేనా?!
తమిళనాడులో రాష్ట్రపతి పాలన తప్పదా? ఆదిశగా కేంద్రమే పావులు కదుపుతోందా? ప్రస్తుతం ఏర్పాటైన పళని స్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున మంత్రాంగం నడుస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. వారం కిందటి వరకు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడిన తమిళనాడు రాజకీయాలు చిన్నమ్మ జైలుకు వెళ్లడం, పళని సీఎం సీటెక్కడంతో అంతా సర్దుకుంటాయని అందరూ భావించారు. కానీ, అసెంబ్లీలో పళని బలపరీక్ష సందర్భంగా జరిగిన కురుక్షేత్ర పర్వం.. తాజాగా రాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తోంది. అసెంబ్లీ బలపరీక్షలో పళని […]